క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, జూన్ 14: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వినుకొండ మండలంలోని విఠంరాజుపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వైజాగ్‌కు చెందిన ముసులూరి వెంకటేశ్వరరావు(48), బూసర కుమారస్వామి (47), మట్టా ప్రవీణ్ రాజు (36), గంటి రామకృష్ణ (53) ప్రకాశం జిల్లా మార్కాపురంలోని భూమిని సర్వే చేసేందుకు గురువారం సాయంత్రం వైజాగ్‌లో బయలుదేరారు. మార్గమధ్యంలో శుక్రవారం తెల్లవారుజామున విఠంరాజుపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడి చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. నాలుగు మృత దేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అస్సన్ తెలిపారు.