క్రైమ్/లీగల్
భార్య ఫిర్యాదుతో.. పూడ్చి పెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొత్తూరు రూరల్, జూన్ 19: భర్త అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ కృష్ణ కథనం ప్రకారం.. ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన యాదయ్య (45) అనే వ్యక్తి జూన్ 10వ తేదిన విద్యుత్ షాక్కుగురై మృతి చెందినట్లు వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని వివరించారు. బుధవారం మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదులో తన భర్త విద్యుత్ షాక్తో మృతి చెందలేదని, అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇన్ముల్నర్వ గ్రామంలో పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ వివరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే దర్యాప్తు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ వివరించారు.