క్రైమ్/లీగల్

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, జూన్ 19: భార్య, భర్తల మనస్పర్దలు, అపర్దాలతో నిండు ప్రాణం బలి తీసుకున్న సంఘటన కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అంబటి బ్రాహ్మణయ్య కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. కాలనీలో పుట్టింటికి వచ్చిన బెజవాడ ధనలక్ష్మి భర్త శివతో మంగళవారం రాత్రి గొడవపడి బాత్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరి వేసుకుని చనిపోయింది. తెల్లవారు జామున భార్య ఇంట్లో కనిపించకపోవటంతో శివ పరిసరాలను గమనించగా బాత్‌రూమ్ లోపల గడియ పెట్టుకున్నట్లు గుర్తించారు. దీంతో బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. మృతురాలి తమ్ముడు వేణు ఫిర్యాదు మేరకు కోడూరు ఎస్‌ఐ ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం అవనిగడ్డ సీఐ శ్రీ్ధర్ కుమార్ పర్యవేక్షణలో శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డకు తరలించారు. తొలుత ధనలక్ష్మికి గొల్లపాలెంలోని ఓ వ్యక్తితో పెండ్లి చేయగా అతని చనిపోవటంతో బెజవాడకు చెందిన శివ అనే వ్యక్తికి రెండవ పెండ్లి చేశారు. శివకు కూడా ఈమె రెండవ భార్య కావటం గమనార్హం. ధనలక్ష్మి శివను పెండ్లి చేసుకున్న తరువాత కుమారుడికి జన్మనిచ్చింది. శివ మొదటి భార్యకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉండటంతో మొత్తం కలిసే ఉంటున్నారు. పది నెలల కిందట అంబటి బ్రాహ్మణయ్య కాలనీ పుట్టింటికి ధనలక్ష్మి రాగా ఆమె భర్త శివ కూడా ఇక్కడికే వచ్చి ఉంటున్నాడు. కోడూరు ఎస్‌ఐ ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి వరకు ఆలనా పాలనా చూసిన అమ్మ తెల్లారే సరికి విగడ జీవిగా పడి ఉండటంతో నలుగురు చిన్న పిల్లల దీన చూపులు ప్రజలను మరింత బాధకు గురి చేశాయి.

*