క్రైమ్/లీగల్

ఆంజనేయపురం చెక్‌పోస్ట్ వద్ద 20 ఎర్రచందనం దుంగలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఏప్రిల్ 1: రేణిగుంట మండలం ఆంజనేయపురం అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద టవేరా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలను చెక్‌పోస్టు సిబ్బంది ఆదివారం పట్టుకున్నారు. ఏపీ 03 బీబీ 1008 నెంబరు కలిగిన టవేరా వాహనంలో ఎర్రచందనం దుంగలను కొంతమంది తీసుకెడుతున్నారని హైవే కారిడార్ వెహికల్ స్ట్ఫా చెక్‌పోస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో అప్రమత్తమైన చెక్‌పోస్టు సిబ్బంది ఆ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.