క్రైమ్/లీగల్

నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు: ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆదివారం రాజోలి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివారాలిలా ఉన్నాయి. ఆదివారం మద్యాహ్నం రాజోలీ మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్‌కు కాలనికి చెందిన వెంకటప్ప, బజారి, ఎల్లప్పల కుమారులు చరణ్ (7) రెండవ తరగతి, శివయ్య(8) రెండవ తరగతి, యుగందర్(5) యూకేజి చదువుతున్నారు. శనివారం కురిసిన వర్షానికి రాజోలి పెద్ద వాగు గుంతలో నీరు నిండుగా ఉండటంతో రోజువారిగా ఆడుకోవడానికి వాగు సమీపంలోకి వెళ్లారు. ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పిల్లలు చీకటిపడ్డా కూడా రాకపోవడంతో వాగు దగ్గరకు వెళ్లి చూడగా మృత్యువాత పడా చిన్నారుల చెప్పులు నీటి కుంట పక్కన పడి ఉండటం స్థానికులు గమనించారు. దీంతో నీటికుంటలో దిగి వెతకసాగడంతో చిన్నారుల మృతదేహాలు లభించాయి. పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. సమీపంలో గ్రామాల ప్రజలు సంఘటన తెలుసుకుని తండోపతండాలుగా తరలివచ్చారు.

చిత్రం...ప్రమాద వశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన చిన్నారులు