క్రైమ్/లీగల్

గన్నవరంలో కారు - లారీ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఏప్రిల్ 1: ఆగి ఉన్న లారీ వెనుకభాగాన్ని కారు ఢీకొని ఇరువురు యువకులు దుర్మరణం పొందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు తమ స్నేహితుని గృహప్రవేశానికి రాజమండ్రి వెళ్తుండగా మార్గమధ్యంలో గన్నవరంలో ఈ ఘటన జరిగింది. గన్నవరంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై ఆగిఉన్న ఇసుక లోడు లారీని వెనుకభాగంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో అనె్నపోగు పవన్ కుమార్ (25) అక్కడికక్కడే దుర్మరణం పొందగా బిజ్జి వినయ్‌కుమార్ (26) చిన్న అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో పయనిస్తున్న మరో యువకుడు పోలిశెట్టి సాయికుమార్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సాయికుమార్ వెనుక సీటులో కూర్చోవడం వల్ల ఎటువంటి గాయాలు తగల్లేదు. ఇతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం సీఐ కె.శ్రీధర్ కుమార్ మృతదేహాలకు పంచానామా నిర్వహించి, శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.