క్రైమ్/లీగల్

నడిరోడ్డుపై దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 26: పాత కక్షలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో చోటుచేసుకున్న సంఘటన పోలీసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేంది. నడిరోడ్డుపై వ్యక్తిదారుణ హత్యకు గురికావడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట బడే మజీద్ ప్రాంతంలో నివాసం ఉండే అన్వర్(32) ఆటోడ్రైవర్. పంజాగుట్ట ప్రతాప్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉండే రియాసత్ అలి కూడా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులు. కొంత కాలం క్రితం ఘర్షణ చోటుచేసుకోవడంతో శత్రువులుగా మారారు. అప్పటి నుంచి ఇద్దరు ఎదురుపడితే వాగ్వాదం చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం పంజాగుట్ట వై టూ కే ఆటోస్టాండ్ వద్దకు వచ్చిన అన్వర్‌తో ఘర్షణ పడిన అలీ అప్పటికే పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా కడుపులో పొడిచాడు. తీవ్రగాయాలైన అన్వర్ తనను రక్షించాలంటూ పరుగుపరుగున పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. స్టేషన్ వరకు చేరుకున్న అన్వర్ మొదటి అంతస్తు ఎక్కలేక గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ కూర్చీలో కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్త్రావంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న అన్వర్‌ను పోలీసులు హుటాహుటిన 108ను రప్పించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్దారించారు. దాడి చేసిన అనంతరం అలీ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నాడని అన్వర్‌పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులను అలీ ఆశ్రయించినట్టు సమాచారం.