క్రైమ్/లీగల్

ప్రైవేటు కాలేజి బస్సు ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమకుర్తి, ఏప్రిల్ 2: చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంకు పనిమీద వెళ్లి స్కూటర్‌పై వస్తూ స్వాతి పెట్రోలు బంకు ఎదురుగా రైజ్ కాలేజిబస్సు స్కూటర్‌ను ఢీకొని కె జాలరావ్ (45)అక్కడికక్కడే సోమవారం సాయంత్రం మృతిచెందాడు. స్కూటరు నడుపుతున్న పి వెంకటేశ్వర్లుకు తీవ్రంగా గాయాలుకాగా ఒంగోలులోని రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్‌పి సుమిత్ర గార్గె అక్కడివిషయాలు తెలుసుకుని మృతిచెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. పోలీసులు ఆ మేరకు కేసునమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.