క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరాయకొండ, జూలై 3 : అర్ధరాత్రి నిద్రమత్తులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలోని కనుమళ్ల జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన కె రామకృష్ణ, కె సత్యకృష్ణ, కె విజయ, కె సుజాత గత రెండు రోజుల క్రితం తిరుమలకు వెళ్లారు. మంగళవారం తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి సమయానికి సింగరాయకొండకు చేరుకున్నారు. కారు నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టి రోడ్డు మధ్యలో బోల్తాపడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న రామకృష్ణ (54) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సింగరాయకొండ సిఐ అజయ్‌కుమార్, ఎస్‌ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన కె సత్యకృష్ణ, కె విజయ, కె సుజాతలను 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు సంఘమిత్ర వైద్యశాలకు తరలించారు. చికిత్సలు పొందుతూ సత్యకృష్ణ (15), కె విజయ (55) మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. వారితోపాటు ప్రయాణిస్తున్న సుజాతకు వైద్యం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా భావిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు.