క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, జూలై 4: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన కులకచర్ల మండలం రాంపురంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల నారాయణ పొలం పనులు చేస్తుండగా తెగిపడిన విద్యుత్ తీగ పైపులైన్‌కు తగిలిన విషయం గమనించకుండా పైపును పట్టుకోవడంతో ఈ రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఎర్త్ కాకపోవడంతో షాక్‌కు గురైనాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల వారే విద్యుత్ తీగను వదలడంతో ఈ సంఘటన జరిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఈమేరకు కులకచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.