క్రైమ్/లీగల్

హైటెన్షన్ వైర్లు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 6: మతి స్థిమితం లేని 51 సంవత్సరాల వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని మృతి చెందిన మొవ్వ శివారు యద్దనపూడి డొంకలో చోటు చేసుకుంది. మొవ్వ శివారు మూలపాలెంకు చెందిన కె వెంకటరెడ్డి (51) శుక్రవారం తెల్లవారు జామున ఇంటి నుంచి బయటకు వెళ్లి రాలేదు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికినా కనపడలేదు. శనివారం మూలపాలెం శివారు యద్దనపూడి డొంకరోడ్డులో అత్తులూరి కోటేశ్వరరావు వ్యవసాయ భూమిలోని హైటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని వేలాడుతున్న మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు వెంకట రెడ్డి కుటుంబ సభ్యులకు తెలియపర్చగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని చల్లపల్లి సీఐ ఎన్ వెంకట నారాయణ పరిశీలించారు.