క్రైమ్/లీగల్

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు: రంగరెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ సమీపంలోని వేబ్రిడ్జి వద్ద హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించి ఆమనగల్లు ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పీ దుర్గాప్రసాద్ అతని భార్య విజయలక్ష్మి, కుమారుడు శాంతన్, బావ రాజు, చెల్లెలు పద్మజతో కలిసి ఇన్నోవా కారులో శ్రీశైలం వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వరంగల్‌కు బయలుదేరారు. మేడిగడ్డ తండాకు ముందు గణపతి వేబ్రిడ్జి వద్ద కల్వకుర్తి వైపునుంచి వస్తున్న ఇన్నోవా కారును ఆమనగల్లు వైపునుంచి భారీ లోడుతో వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న దుర్గాప్రసాద్ (55), భార్య విజయలక్ష్మి (45), కుమారుడు శాంతన్ (25), బావ రాజు (40), చెల్లెలు పద్మజ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఇన్నోవా కారు డ్రైవర్ ఖలీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లేశ్వర్ తెలిపారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, ఆమనగల్లు సీఐ నర్సింహా రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు.

చిత్రం... ప్రమాద స్థలంలో పడిఉన్న మృతదేహాలు