క్రైమ్/లీగల్
వంశధార ట్రిబ్యునల్ విచారణ వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 9 July 2019
న్యూఢిల్లీ, జూలై 9: వంశధార ట్రిబ్యునల్ విచారణ ఆగస్టు 27కు వాయిదా పడింది. గతంలో వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో స్పష్టత కోరుతూ ఒడిశా దాఖలు చేసిన అప్లికేషనను మంగళవారం జస్టిస్ ముకుందం శర్మ నేతృత్వంలోని ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఒడిశా తరపు న్యాయవాది జయంత్ భూషణ్, కత్పాలియా, రాధేశ్యాజేనాలు వాదనలు వినిపించారు. అలాగే ఏపీ తరపున ఈనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ తేదీలను ఆగస్టు 27, సెప్టెంబరు 4, 5గా ట్రిబ్యునల్ ఖరారు చేసింది. ఏపీ తరపు న్యాయవాదులు ఉమాపతి, రాజగోపాల్రావు, కేంద్రం తరపున ఖ్వాద్రి హాజరయ్యారు.