క్రైమ్/లీగల్

భార్యపై అనుమానంతో లారీ కిందకు తోసి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝరాసంగం, జూలై 9: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఎలాగైనా ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. అనుమానం రాకుండా దైవదర్శనానికి తీసుకువచ్చి ప్లాన్ ప్రకారం హత్య చేసి ప్రమాదంగా చిత్రికరించేందుకు యత్నించి చివరకు కటకటాల పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం ఎస్సై ఏడుకొండల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలావున్నాయి. మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌కు చెందిన శంకర్ ఆయన భార్య నాగమణితో కల్సి సోమవారం ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వరస్వామి దేవాలయానికి దర్శనం కోసం వచ్చారు. రాత్రి ఝరాసంగం నుండి తిరుగు ప్రయాణంలో ఆటలో ఎక్కి కుప్పానగర్ శివారులోకి వెళ్లారు. ఆటో టైర్ పంక్చర్ కావడంతో భార్యా భర్తలిద్దరూ రోడ్డుపై నిల్చున్నారు. అప్పటికే తన గ్రామానికి చెందిన స్నేహితుడు లారీ డ్రైవర్ రాములుతో సెల్‌ఫోన్‌లో టచ్‌లో ఉన్న శంకర్ వెనుక నుంచి వస్తున్న లారీ కిందకు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన భార్య నాగమణి (38)ని తోసేశాడు. దీంతో లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో తల నుజ్జునుజ్జుగా మారి వెంటనే ప్రాణాలు వదిలింది. దీనిని ప్రమాదమని చిత్రీకరించేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శంకర్‌ను తమ శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. భార్యపై అనుమానంతో శంకర్ పలుమార్లు ఆమెతో గొడవ పడడంతో గ్రామంలో పం చాయతీలు కూడా జరిగినట్టు తేలింది. దీంతో ఏవిధంగానైనా భార్యను అంతమొందించాలనుకుని లారీ డ్రైవర్‌తో కల్సి పథకం ప్రకారం హత్య చేశారు. మృతురాలి తండ్రి శరణప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.