క్రైమ్/లీగల్

టీఆర్‌ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, జూలై 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తకొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న నల్లూరి శ్రీనివాసరావు సోమవారం రాత్రి 10గంటల సమయంలో తన ఇంట్లో నిద్రిస్తుండగా సుమారు 20మంది వరకు మావోయిస్టులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇది గమనించిన శ్రీనివాసరావు కుమారుడు ప్రవీణ్ ఎవరు మీరంటూ అడిగేలోపే అతన్ని పక్కకు నెట్టేశారు. అనంతరం శ్రీనివాసరావును లాక్కెళుతుండగా కుమారుడు, భార్య అడ్డుపడ్డారు. ఈ క్రమంలో అతని కుమారుడు ప్రవీణ్‌ను మావోయిస్టులు తలపై కొట్టారు. అతను గాయపడ్డారు. శ్రీనివాసరావు భార్యను కూడా కొట్టారు. అనంతరం శ్రీనివాసరావును మావోయిస్టు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. వరండాలో ఉన్న శ్రీనివాసరావు ద్విచక్ర వాహనాన్ని కూడా మావోలు తీసుకెళ్లారు. ఈ ఘటనపై శ్రీనివాసరావు భార్య దుర్గ మాట్లాడుతూ తన భర్త ఎలాంటి తప్పులు చేయలేదని చెప్పింది. అందరికీ సాయం చేసే నాయకుడని, మావోయిస్టులు ఈ విషయం గ్రహించి తన భర్తను విడిచిపెట్టాలని ఆమె విజ్ఞప్తి చేసింది.