క్రైమ్/లీగల్
ఎర్రమంజిల్ కేసు 15కు వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 13 July 2019
హైదరాబాద్, జూలై 12: అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణ కొనసాగింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. ఎర్రమంజిల్లోని భవనం 150 ఏళ్ల క్రితం కట్టిందని పిటిషనర్లు వాదించారు. 2015లో జారీ చేసిన పురాతన భవనాల జాబితా నుండి ఎర్రమంజిల్ ప్యాలెస్ను ప్రభుత్వం కావాలనే తొలగించిందని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదించారు. ప్రభుత్వ జీవోపై పిటిషన్లు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.