క్రైమ్/లీగల్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 14 July 2019
పరిగి, జూలై 13: అప్పుల బాధ కుటుంబ కలహాలతో మనో వేదనకు గురై వ్యవసాయ పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఉధన్ రావుపల్లి గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. దోమ మండల పరిదిలోది తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన గుడిసె రాములు (43) రైతు తమ వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, ఇతడికి అర ఎకరా వ్యవసాయ పొలం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కాస్త కుటుంబ కలహలకు దారి తీశాయి. తీవ్ర మనో వేదనకు గురై శుక్రవారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీస్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.