క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు దళ కమాండర్లు హతమయ్యారు. జిల్లాలోని కిరండల్ పోలీసుస్టేషన్ పరిధిలో గుమియాపాల్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ బలగాలు మావోయిస్టుల కోసం వేట ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా భద్రత బలగాలను చూసి కాల్పులకు దిగారు. బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో మంగ్లీ, దేవ అనే ఇద్దరు కమాండర్లు మృతి చెందారు. మంగ్లీ మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు కూడా. హతమైన ఇద్దరిపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది. సంఘటన స్థలంలో 303 రైఫిల్, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు కోసీ అనే మావోయిస్టు, మరో సీఎస్‌ఎం సభ్యుడు కూడా బలగాల చేతికి చిక్కారని, కాల్పుల అనంతరం మావోలు పరారవగా వారి కోసం బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.
చిత్రం...ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోలు