క్రైమ్/లీగల్

భార్య, అత్తను నరికి చంపిన కిరాతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపురం, జూలై 19: కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్త, అత్తను కత్తితో నరికి హత్యచేసిన కిరాతకుడి ఉదంతమిది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని రాంపాలెం గ్రామానికి చెందిన కుమ్మరి కాంతారావు దొండపూడి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మిని పదేళ్ల కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. ఇటీవల లక్ష్మి భర్తతో గొడవపడి, దొండపూడిలోని పుట్టింటికి వచ్చి ఉంటోంది.
శుక్రవారం దొండపూడి వచ్చిన కాంతారావు లక్ష్మితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కత్తితో భార్య లక్ష్మి (28), అత్త పుష్పవతి (50)పై దాడిచేశాడు. వారు అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డువచ్చిన బావమరిది కప్పల మంగారావుపై కూడా దాడి చేయడంతో అతడి చేతికి గాయమైంది. స్థానికులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ నాయక్, గోపాలపురం ఎస్‌ఐ వి సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.