క్రైమ్/లీగల్
నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 July 2019
న్యూఢిల్లీ, జూలై 19: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల అటవీ అధికారులపై దాఖలు చేసిన అట్రాసిటీ కేసుల ప్రొసీడింగ్స్పై సుప్రీం కోర్టు ‘స్టే’ విధించింది. ఈ కేసులపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అమికస్ క్యూరీ ఏడీఎస్ రావు సుమోటోగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తెలంగాణలో జరిగిన అటవీ అధికారులపై దాడి కేసులో తదితర అంశాలపై ఏ చర్య తీసుకున్నారో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.