క్రైమ్/లీగల్

హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 22: అనుమానాస్పద స్థితిలో పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థిని మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని హెచ్‌సీయూలో జరిగింది. విద్యార్థిని మృతిపై గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లోని మధురఖాట్ కరగ్‌పూర్ సిటీకి చెందిన దీపికా మహాపాత్ర (29) హెచ్‌సీయూలో ఆదివాసి స్టడీస్ (హిందీ) పీహెచ్‌డీ మూడవ సంవత్సరం చదువుతుంది. హెసీయూలోని ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 204లో నివాసముంటుంది. ఉదయం 7.30 గంట సమయంలో బాత్‌రూములో స్నానం చేయడానికి వెళ్లిన దీపిక అకస్మాతుగా కింద పడిపోవడంతో పక్కనున్న తోటి విద్యార్థినులు నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. దీపికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించినట్లు సీఐ తెలిపారు. దీపిక ఎనిమిది సంవత్సరాల నుండి ఫిట్స్ (న్యూరో) సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ రికార్డులో కూడా దీపిక న్యూరో సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు.