క్రైమ్/లీగల్

అంత్యక్రియలకు వెళుతూ అనంతలోకాలకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, జూలై 23: బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతిచెందగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలైన విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సిద్దేపల్లి గ్రామానికి చెందిన తుమ్మల లక్ష్మమ్మ (62), ఆమె కుమారుడు నరేందర్ (43), కోడలు మమత చౌటుప్పల్‌లోని దివిస్ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామానికి చెందిన తమ సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఆకుపాముల గ్రామసమీపాన అతివేగం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న లక్ష్మమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కారు నడుపుతున్న కుమారుడు నరేందర్, కొడలు మమత, వారి కుమారులు అవినాశ్, ఆశ్రుత్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో నరేందర్ మృతిచెందాడు. ఆయన భార్య, కుమారులకు సైతం తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు మామ పాలడుగు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు మునగాల ఎస్‌ఐ దాసరి మహిపాల్‌రెడ్డి తెలిపారు.

చిత్రాలు.. ప్రమాదానికి గురైన కారు, మృతి చెందిన తల్లి లక్ష్మమ్మ (62), కుమారుడు నరేందర్ (43)