క్రైమ్/లీగల్
కారు, లారీ ఢీ- మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 8 April 2018
చంద్రగిరి, ఏప్రిల్ 8: చంద్రగిరి మండలం మామండూరు వద్ధ కారు-లారీ ఢీకొనడంతో మహిళ మృతిచెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన ధనంజయ కుటుంబ సభ్యులు మారుతీ కారులో తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవగా మామాండూరు వద్ద చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ కారును ఢీకొనడంతో ధనంజయ, భార్య కోమల, మరో ముగ్గరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా దారిమధ్యలో కోమల (45) మృతిచెందింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.