క్రైమ్/లీగల్
రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కాల్చివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 31 July 2019
అంబాలా, జూలై 31: విశ్రాంత ఇన్స్పెక్టర్ను దుండగులు కాల్చి చంపిన ఘటన పంజాబ్లోని అంబాలాలో జరిగింది. బుధవారం ఉదయం అంబాలా కంటోనె్మంట్ ప్రాంతంలో సత్విందర్ సింగ్ మార్నింగ్ వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతూ, మార్గమధ్యంలో ఓ టీ స్టాల్ వద్ద ఆగారు. ఇంతలో దుండగులు సత్విందర్ సింగ్పై తుపాకులతో కాల్పులు జరిపి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు. బులెట్ల గాయపడిన సత్విందర్ సింగ్ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళామని, అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారని వారు చెప్పారు. కేసు నమోదు చేసి, చుట్టు పక్కల దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాల వీడియో ఫుటేజీలను సేకరించి, దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.