క్రైమ్/లీగల్

అగ్రిగోల్డ్ చైర్మన్, డైరెక్టర్లకు జ్యుడీషియల్ రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 9: అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావుతో పాటు మరో నలుగురు డైరెక్టర్లకు ఈ నెల 23వతేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015వ సంవత్సరంలో చిలకలపూడి, జగ్గయ్యపేట పోలీసు స్టేషన్‌లలో మెచ్యురిటీ ఎవౌంట్ ఇవ్వలేదన్న కారణంతో చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు అవ్వా హేమ సుందర వర ప్రసాద్, అవ్వా వెంకట శేషు నారాయణరావు, అవ్వా సత్య వెంకటేశ్వరరావు, అవ్వా ఉదయ భాస్కరరావులపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసును సీఐడీకి బదలాయించారు. సోమవారం పీటీ వారెంట్‌పై చైర్మన్‌తోపాటు నలుగురు డైరెక్టర్లను సీఐడీ సీఐ వెంకట నారాయణ జిల్లా ప్రధాన న్యాయస్థానంలో హాజపర్చారు. విచారణ నిర్వహించిన న్యాయమూర్తి వై లక్ష్మణరావు 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వీరిని ఏలూరు సబ్ జైలుకు పంపినట్లు సీఐడీ సీఐ వెంకట నారాయణ తెలిపారు.