క్రైమ్/లీగల్

సాగర్ కాల్వలోపడి ఇద్దరు యువకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుబల్లి, ఏప్రిల్ 12: మండలపరిధిలోని టేకులపల్లి సమీపంలో గల సాగర్ కాల్వలో ప్రమాదవశత్తు పడి కల్లూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన గురువారం వెలుగు చూసింది. ఈ సంఘటనలో కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి అంజనీ సాయికృష్ణ (20), రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఐతరాజు సాయితేజ (20) మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికృష్ణ, తేజ ఇద్దరూ కలిసి డిగ్రీ చదువుతున్నారు. వీరద్దరూ మంచి స్నేహితులు. బుధవారం ఉదయం వీరిద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై వేంసూరు మండలం కందుకూరు, పెనుబల్లి మండలం యడ్లబంజర్ గ్రామాలలో వివాహ వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణంలో కాలువకట్టపై బత్తులపల్లి వెళుతున్నారు. టేకులపల్లి వద్ద గల పడమటి వాగు వద్ద వారు వాహనాన్ని ఆపి కాల్వలో దిగి ప్రమాదవశత్తునీటిలో పడిపోయారు. రాత్రైనా ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల గ్రామాలలో వెతికినా కనబడలేదు. గురువారం తెల్లవారుఝామున కాల్వకట్టపై వస్తుండగా టేకులపల్లి వాగువద్ద ద్విచక్ర వాహనం, చెప్పులు కనబడటంతో ఈతగాళ్లతో గాలించి రెండు మృతదేహాలను బయటికి తీశారు. చేతికొచ్చిన కొడుకులు మృతి చెందటంతో ఆ రెండు కుటుంబాల రోదనలు మిన్నంటాయి. వీఎం బంజర్ ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.