క్రైమ్/లీగల్

మైనర్‌ను వేధించిన యువకుడిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, ఏప్రిల్ 12: దళిత గిరిజన మైనర్ బాలికను వేదింపులకు గురిచేసిన యువకుడిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. గోకవరం ఎస్సై జి ఉమమహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..రంపచోడవరం మండలం కె యర్రంపాలెం గ్రామానికి చెందిన గిరిజన మైనర్ బాలిక రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆ బాలిక కళాశాలకు వెళ్లేందుకు ప్రతి రోజు ఎక్కే బస్సులో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామానికి చెందిన ఎద్దు కృపావరం కూడా ఎక్కేవాడు. ఈ విద్యార్థి లెనోరా కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. వీరిద్దరికీ పరిచయమేర్పడింది. గిరిజన మైనర్ బాలిక చెల్లి పుట్టిన రోజు కావడంతో ఈ నెల 11న గోకవరం వచ్చి కేక్ తీసుకుని తన స్నేహితులు, బంధువులతో కలిసి స్వగ్రామం వెళ్లేందుకు ఆర్టీసీ డిపోలో బస్సుకోసం నిరీక్షిస్తున్న సమయంలో కృపావరం ఆర్టీసీ డిపోకు వచ్చి బాలిక స్నేహితురాలితో మాట్లాడుతూ గిరిజన బాలికకు అతని సెల్ ద్వారా ఫొటోలు తీశాడన్నారు. అది చూసిన బాలిక ఫొటోలు ఎందుకు తీశావని ప్రశ్నించగా, నీకు వివాహం కుదిరింది కదా..వీటిని నీకు కాబోయే భర్తకు పంపిస్తానని చెప్పాడు. ఫొటోలు డిలిట్ చేయమని చెప్పి వెళ్లిపోతుండగా ఆమెకు ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడుతూ తనతో అరగంట సేపు శారీరికంగా కలవాలని, అప్పడే ఫొటోలు డిలిట్ చేస్తానని కృపావరం చెప్పాడు. ఈ మేరకు గిరిజన మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.