క్రైమ్/లీగల్

గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 12: ఒంగోలు నగరంలోని మంగమూరురోడ్డులోని కొత్తడొంకలో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటున్న పిల్లపై గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో గుడిమిట్ల నవదీప్(7), సిందే ప్రేమ్‌చంద్ (7), కట్టా మణికంఠ (7)లుగా గుర్తించారు. మరో ఐదేళ్ళ సిందే ప్రేమజ్యోతి అనే బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొత్తడొంకలో నూతనంగా నిర్మించిన ప్రహరిగోడకు అమర్చిన గేటును పట్టుకుని చిన్నారులు ఆడుకుంటుండగా గేటు విరిగి చిన్నారులపై పడింది. దీంతో నవదీప్ అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రేమ్‌చంద్, మణికంఠ, ప్రేమ అనే ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలు కావటంతో ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. వీరిలో చికిత్సపొందుతూ ప్రేమ్‌చంద్, మణికంఠ అనే బాలురు మృతిచెందారు. తీవ్రగాయాలపాలైన బాలిక ప్రేమకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.