క్రైమ్/లీగల్

వ్యక్తి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమందేపల్లి, ఏప్రిల్ 13 : మండల కేంద్రంలోని స్నేహలతా నగర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (36) శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు ఏ ప్రాంతానికి చెందిన వాడో కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. నీలం రంగు గళ్ల చొక్కా, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. వ్యక్తి మృతి చెందిన విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతుడిని ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడవేశారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న విషయాలు తెలియరాలేదు. ఈమేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
తాడిపత్రి, ఏప్రిల్ 13: మండలంలోని నందలపాడు రెవిన్యూ గ్రామపరిదిలో పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బెస్త నాగరంగయ్య(48) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మండల రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ మల్లేష్ తెలిపిన వివరాలమేరకు తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన రంగనాయకులు అనారోగ్య కారణంలో రైల్వేస్టేషన్ సమీపంలోని మహేష్‌బాబుకు చెందిన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినాడని తెలిపారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.