క్రైమ్/లీగల్

నూకాంబిక ఆలయం రాజగోపుర నిర్మాణంలో అపశృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి రూరల్, ఏప్రిల్ 13: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాద్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ రాజగోపుర నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. 1.80కోట్ల వ్యయంతో ఆలయ ప్రధాన ముఖద్వారం ఎదురుగా రాజగోపుర నిర్మాణం జరుగుతుంది. నిర్మాణ పనుల్లో భాగంగా కాంక్రీట్ పనులకు మిక్సర్‌ను దించుతుండగా సంబంధిత వాహనం నిర్మాణం జరుగుతున్న కాంక్రీట్ పనుల వద్దకు బోల్తాకొట్టింది. సంబంధిత వాహనం నడిపే డ్రైవర్ శిలపరెడ్డి దుర్గాప్రసాద్ (22) డోర్ తెరచి బోల్తాకొట్టిన వాహనం వైపే పడిపోయాడు. సంబంధిత డ్రైవర్‌పై ఆ వాహనం పడిపోయింది. అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని వందపడకల ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ నిర్మాణ పనులు చేపడుతున్న నిడదవోలుకు చెందిన కాంట్రాక్టర్ కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మృతునికి వావాహం కాలేదు. బుచ్చెయ్యపేట మండలంలోని అప్పంపాలెంకు చెందిన మృతునికి తల్లిదండ్రులున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా వ్యవహరించే కుమారుడు దుర్మరణం చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, గౌరీపాలసొసైటీ అధ్యక్షులు దాడి జయవీర్‌లు సందర్సించి మృతుని కుటుంబీకులను పరామర్సించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.