క్రైమ్/లీగల్

ఆటో ఢీకొని చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 20: ఆటో వెనుకనుంచి ఢీకొని మూడు సంవత్సరాల చిన్నారి మృతిచెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కాటేదాన్ ప్రాంతానికి చెందిన వీరన్న లారీ డ్రైవర్. ఇతనికి భార్య, మూడేళ్ల కూతురు రాణి ఉన్నారు. మంగళవారం కాటేదాన్‌లోని బట్టలషాపుకు వెళ్లారు. షాపింగ్ ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో ఆటోను రోడ్డుపై ఆపి డ్రైవర్ టీ తాగడానికి వెళ్లాడు. ఆటో బ్రేక్ ఫెయిల్ అవడంతో ఆటో వెనుక నిల్చొని ఉన్న రాణిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాణికి తీవ్రగాయాలై మృతిచెందింది. విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.