క్రైమ్/లీగల్
భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 August 2019
రాజేంద్రనగర్, ఆగస్టు 20: భవనం పైనుంచి ఓ వ్యక్తి పడి తీవ్రగాయాలపాలై మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీ అమ్మా గార్డెన్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవంతి పైనుంచి వ్యక్తి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని, వ్యక్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.