క్రైమ్/లీగల్
భారీ వర్షానికి పాక కూలి ఒక వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 April 2018
నాతవరం, ఏప్రిల్ 13: నాతవరం గ్రామానికి చెందిన భీమిరెడ్డి లచ్చబాబు(53) గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి పాక కూలి మరణించాడు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం లచ్చబాబు పొలంలోకి వెళ్ళాడు. ఒక్కసారిగా గాలి,వాన కురియడంతో పశువుల పాకలోకి వెళ్ళాడు. ఈ లోగా గాలి బారీగా వీయడంతో పాకలోని సిమ్మెంట్ స్థంబాల మీదన పడి మృతి చెందాడు. ఈమేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి పీ ఎం నిమిత్తం మృత దేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.