క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు టౌన్, ఏప్రిల్ 13: గృహనిర్మాణ పనుల్లో భాగంగా విద్యుత్ పనులు చేస్తూ తీగలు తగలడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై గూడూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. సైదాపురం మండలం పొక్కందల గ్రామానికి చెందిన కుమ్మూరు సుధాకర్ (26), చెన్నూరు గ్రామానికి చెందిన దండె శ్రీహరి ఇద్దరు కలసి గూడూరు రూరల్ మండలం చెన్నూరుగ్రామం ఎరుకల కాలనీలో ఇంటికి సంబంధించిన బేల్దారి పనులు చేస్తున్నారు. ఇంటిలోని విద్యుత్ తీగలు సుధాకర్‌కు తగలడంతో దీన్ని గమనించిన శ్రీహరి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో శ్రీహరికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సుధాకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.