క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, ఆగస్టు 29: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి కనగాల రవీంద్రబాబుతో మృతురాలు ధనలక్ష్మికి గత ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం కలిగారు. గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో పెద్దలు పంచాయతీ పెట్టారు. గొడవల కారణంగా గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఇద్దరూ గత వారం రోజులుగా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన కుమార్తెను చూసేందుకు తల్లి కుంపటి కాంతమ్మ డోకిపర్రు గ్రామానికి వచ్చింది. అయితే మీ అమ్మాయికి జ్వరం వచ్చిందని, నిడుమోలు ఆస్పత్రిలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం నిమిత్తం మచిలీపట్నం తరలిస్తుండగా ధనలక్ష్మి మృతి చెందింది. ధనలక్ష్మి మృతిపై తమకు అనుమానం ఉందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.