క్రైమ్/లీగల్

రైలు ప్రయాణికులపై మత్తుమందు ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఆగస్టు 30: రైలు ప్రయాణికులకు మత్తుమందు ప్రయోగం చేసి, వారి వద్ద ఉన్న బంగారు నగలు దోచుకున్న సంఘటన శుక్రవారం గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది. కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన ఎలిసే, మరియ 16345 నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలులో ముంబాయి నుండి కొట్టాయంకు గురువారం బయలుదేరారు. ఏసీ కోచ్‌లోని బీ-3, 61, 57లో ప్రయాణిస్తున్న వీరికి లోనోవాలా రైల్వేస్టేషన్ సమీపంలో 65 బెర్తులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మత్తుమందు కలిపిన కాఫీ ఇచ్చాడు. ఇది తాగిన ఇద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లారు. దీంతో ఆ వ్యక్తి వారి వద్ద ఉన్న బంగారం ఉంగరాలు, నగలు అపహరించుకుని వెళ్లాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఎలిసే, మరియ రాయచూర్ రైల్వే స్టేషన్‌లో ప్రాథమిక చికిత్స అందించి గుంతకల్లు రైల్వే జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రైలు గుంతకల్లుకు రాగానే బాధితులను రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరూ ఇంకా అపస్మారకస్థితిలోనే ఉండడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై గుంతకల్లు రైల్వే జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.