క్రైమ్/లీగల్

యువకుని వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 30: యువకుడి వేధింపులకు ఒక విద్యార్థిని బలైంది. అతడు తరచూ సూటీపోటీ మాటలతో వేధించడం, అసభ్యకరంగా ఫోన్ మెసేజీలు పెట్టడంతో అవమానం భరించలేక గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో జరిగింది. సంస్థాన్‌నారాయణపురం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపిన ప్రకారం మండల స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాలలో గుండ్లమెట్టకాలనీకి చెందిన పొట్ట భవానీ (14) పదో తరగతి చదువుకుంటోంది. ఆదే కాలనీకీ చెందిన సుక్క గిరిబాబు (23) కన్ను భవానీపై పడింది. పాఠశాలకు వెళుతూ, వస్తున్న ప్పుడు ఆమెను గిరిబాబు మాటలతో వేధించేవాడు. ఫోన్‌లో అసభ్యంగా మెస్సేజీలు పెట్టేవాడు.
గురువారం సాయంత్రం పాఠశాలకు వెళ్లి వస్తుండగా మధ్యలో ఆపి మళ్ళీ వేధించాడు. ఈ విషయాలు ఏవీ పొట్ట వెంకటయ్య (హోంగార్డు)కు, తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు విద్యార్థిని చెప్పలేదు. గురువారం ఆ కాలనీ వాసులంతా బోనాల పండుగ చేసుకుంటున్నారు. అందరూ బోనాలను తీసుకుని దేవాలయాలకు వెళ్లిపోయారు. రాత్రి సుమారు ఏడున్నరగంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవానీ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బోనాల పండుగ తరువాత అందరూ ఇంటికి వచ్చారు. ఇంట్లో భవానీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకుని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈమేరకు తండ్రి వెంకటయ్య శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేశా రు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.