క్రైమ్/లీగల్

ఆకతాయ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, ఆగస్టు 30: ఆకతాయి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దుబ్బాక గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాధు వివరాల ప్రకారం మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన ఇట్టె మహిపాల్‌రెడ్డికి నార్కట్‌పల్లి మండలం నెమ్మానీ గ్రామానికి చెందిన శృతితో గత మే 15న వివాహం జరిగింది. వివాహం అనంతరం ఇద్దరు దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నెమ్మానీ గ్రామానికి చెందిన ముడిదొడ్డి గణేష్ అనే యువకుడు శృతి వివాహం కంటే ముందు గత కొనే్నళ్లుగా తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. గతంలో అతనిపై షీటీంకు ఫిర్యాదు చేయడంతో నార్కట్‌పల్లి పోలీస్ ష్టేషన్‌లో కేసు నమోదైంది. వివాహం అనంతరం కూడా శృతితో పాటు ఆమె భర్తకు మహిపాల్‌రెడ్డి ఫోన్‌నెంబర్‌కు అసభ్యకరమైన మేసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈనెల 27న భర్తతో కలిసి శృతి అత్తగారి స్వగ్రామమైన దుబ్బాకకు వచ్చింది. రెండురోజుల నుండి గణ్‌ష్ వేధింపులు తీవ్రం కావడంతో తీవ్ర మానసికక్షోభకు గురై శుక్రవారం ఉదయం స్నానానికి వెళ్లి బాత్‌రూంలో ఉరివేకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు.