క్రైమ్/లీగల్

నంద్యాలలో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, సెప్టెంబర్ 5: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా పాణ్యం డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఏకకాలంలో నంద్యాల, కోవెలకుంట్ల, పాణ్యం మండలం కొండజూటూరు గ్రామాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. కోవెలకుంట్ల, నంద్యాలలో నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పొద్దుపోయేంత వరకు సోదాలు జరిగాయి. శుక్రవారం తుది నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.