క్రైమ్/లీగల్

సీపీఐ నేత హత్య కేసులో మరో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్హాపూర్, సెప్టెంబర్ 6: మహారాష్టక్రు చెందిన వెటరన్ సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 2015లో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వీరిని ప్రత్యేక విచారణ బృందం (సిట్) అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికి అరెస్టు చేసిన వారి సంఖ్య 12కు చేరింది. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిలో సచిన్ అండురే, అమిత్ మడ్డీ, గణేష్ మిస్కిన్‌లు ఉన్నారు. ఈ ముగ్గురూ ఇప్పటికే వేర్వేరు కేసుల్లో వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నరేంద్ర దబోల్కర్ కేసులో షార్ప్ షూటర్ అయిన సచిన్ అండురే పూణెలోని ఎరవాడ జైల్లో ఉండగా.. బడ్డీ, మిస్కిన్‌లు ముంబయిలోని అర్ధర్‌రోడ్డు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సిట్ బృందం శుక్రవారం పేర్కొంది. కాగా, పన్సారేను 2015లో కొల్హాపూర్‌లో కాల్చి చంపారు.