క్రైమ్/లీగల్

సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి, బుడగట్లపాలెం మధ్యలో ఉన్న సముద్రం వద్దకు శుక్రవారం ఇద్దరు యువకులు స్నానానికి వెళ్లి గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. కుప్పిలి గ్రామానికి చెందిన బోర రమణ(20), నిమ్మ సంతు(21) మధ్యాహ్నం భోజనాలు చేశాక సముద్రం మొగ వద్దకు వెళ్లారు. అక్కడ లోతుగా ఉండడం వల్ల ఇద్దరూ గల్లంతు కావడంతో పశువుల కాపరులు గమనించి స్థానికులకు సమాచారం అందించారు. దీంతో రమణ, సంతు కుటుంబాలకు చెందిన పలువురు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు యువకులూ గల్లంతు కావడంతో బాధిత కుటుంబాలలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి, మాజీ సర్పంచ్ అలుపున నాగిరెడ్డి, తహశీల్దార్, ఎస్సైకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.