క్రైమ్/లీగల్

కారు బోల్తా.. ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్ళపల్లి, సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం రాయిగూడెం, సీతారంపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందారు. శనివారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులో బోల్తాపడింది. కారు డోర్లు తెరుచుకోక పోవడంతో అర్రెం రాజబాబు, పాయం రవి బయటికి రాలేక, ఊపిరాడక నీటిలోనే చనిపోయారు. స్థానికులు వారిని గుర్తించి చెరువు నీటి నుండి బయటకు తీశారు. రాజబాబు గతంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి ఓడిపోయారు. ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందిన ఇద్దరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, నాయకులు ఎల్లయ్య, ఈసం రమాదేవీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు ఎండీ ఆసిఫ్, ఖయ్యూమ్, జెడ్పీటీసీ కోరం హనుమంతరావు, ఎంపీపీ మంజుభార్గవి కోరారు.