క్రైమ్/లీగల్

నీట మునిగి ఇద్దరు చిన్నారుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, సెప్టెంబర్ 9: నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన పోచం సంజయ్ లింగారెడ్డి(9), లోకేష్(8) పొలం వద్ద నీటి కోసం తవ్విన గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయారు. పిల్లల కోసం వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈతగాళ్ల సాయంతో గుంతలో వెతికించగా పిల్లల మృతదేహాలు బయటపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.