క్రైమ్/లీగల్

మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..మట్టుబెట్టిన తాత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, సెప్టెంబర్ 9: రెండవసారి కూడా ఆడ పిల్ల పుట్టిందన్న కోపంతో పుట్టిన పసిపాపను స్వయాన తాతే పురిటిలోనే చిదిమేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కేశవపురం గ్రామ శివారలో చోటు చేసుకుంది. మండలంలోని కేశవపురం శివారు ఎర్రకుంట తండాకు చెందిన భూక్య బిచ్చకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు తిరుపతికి అదే తండాకు చెందిన గుగులోతు సోములు కుమార్తె మమతను ఇచ్చి ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ఈ నేపథ్యంలో వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. కాగా రెండవ కాన్పు కోసం ఈనెల 4న వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మమత మళ్లీ రెండవసారి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన రెండు రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చిన మమతను చూసి ఆమె మామ బిచ్చ మళ్లీ ఆడ పిల్లే పుట్టిందా? అని ఆసహనంతో ఊగిపోయాడు. మమత తండ్రి సోములు తమ బిడ్డను తమ ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చాడు. అయతే పసిపాప లేకపోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రాయపర్తి ఎస్సై లక్ష్మణ్‌రావు జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి తండాకు వెళ్లి శిశువు మృతి పట్ల ఆరా తీశారు. అనంతరం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శిశువు జననం, ఆమె ఆరోగ్యం పట్ల వివరాలు సేకరించారు. తండాలో నేడు శిశువు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు సమాచారం.