క్రైమ్/లీగల్

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 10: మద్యం మత్తులో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పీర్జాదిగూడ పాత బస్తీలో నివసిస్తున్న ఎండీ జావీద్ (45) కూలీ. అతడు నిత్యం తాగుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం తాగిన మత్తులో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. అతనికి భార్య ఆరుగురు పిల్లలు ఉన్నారు. మొహర్రం పండుగ రోజు జావీద్ మృతితో విషాధ చాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.