క్రైమ్/లీగల్

క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపురం, ఏప్రిల్ 14: గోపాలపురంలో ఒక ఇంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గుర్ని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.94,380లు నగదు, 8 సెల్ ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీ, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్టు ఐపీఎస్ ట్రైనీ అధికారి, దేవరపల్లి ఎస్‌హెచ్‌వో వై నిశాంత్‌రెడ్డి శనివారం సాయంత్రం విలేఖర్లకు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఐపీఎస్ ట్రైనీ అధికారి నిశాంత్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక టాక్సీ స్టాండు వద్దనున్న ఒక పెంకుటింట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు గోపాలపురం ఎస్సై ఎం జయబాబు సహకారంతో శుక్రవారం రాత్రి దాడి చేశామన్నారు. టీవీలో క్రికెట్ చూస్తూ సెల్‌ఫోన్లో మాట్లాడుతూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్నారు. వెంకటాయపాలెం, గోపాలపురం, దేవరపల్లి, హుకుంపేట, పోలవరం తదితర గ్రామాలకు చెందిన సుమారు 11మంది ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు