క్రైమ్/లీగల్

104వాహనం, బస్సు ఢీ: ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలిజిపేట, ఏప్రిల్ 14: మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసి బస్సు, 104 వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ సింహాచలం అందించిన వివరాల ప్రకారం మండలం నారాయణపురం గ్రామం నుంచి బొబ్బిలివైపు 104వాహనం వస్తుండగా మిర్తివలస గ్రామ శివాలయం వద్ద బొబ్బిలి నుంచి బలిజిపేట వైపు వెళుతున్న ఆర్టీసి బస్సు ఢీకొనడంతో 104వాహనం డ్రైవర్ చిల్లా మోహనరావు(30) అక్కడికక్కడే మృతిచెందగా అదేవాహనంలో ఉన్న ల్యాబ్ టెక్నిషియన్ ఎం వెంకటినాయుడు, స్ట్ఫానర్సు ఆకుల సంతోషిలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్ట్ఫానర్సు ఆకుల సంతోషి 6నెలల గర్భిణీ. ఈమె కాలు విరిగిపోవడంతో మెరుగైన వైద్యం కోసం బొబ్బిలి సిహెచ్‌సికి తరలించారు. మృతిచెందిన మోహనరావు స్వగ్రామం నర్సీపురం. ఈమేరకు సంఘటనా స్థలాన్ని సీఐ ప్రసాద్ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.