క్రైమ్/లీగల్
భర్తను చంపిన భార్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 September 2019
షాద్నగర్ రూరల్, సెప్టెంబర్ 15: భార్యభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భర్త తలపై భార్య రాయితో మోది హత్య చేసిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం కందివనం గ్రామంలో చోటు చేసుకుంది. షాద్నగర్ సీఐ శ్రీ్ధర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి కందివనం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల విష్ణుమూర్తి, శారద దంపతులు ఘర్షణ పడినట్లు తెలిపారు. భార్య శారద భర్త విష్ణుమూర్తి కళ్లల్లో కారంపొడి పోసి తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు తెలిపారు. విష్ణుమూర్తి(30) అక్కడిక్కడే మృతిచెందినట్లు సీఐ తెలిపారు. మృతుడికి శివ(7), విజయ్(5) అనే ఇద్దరు కుమారులు ఉన్నాయి. మృతుడి అక్క జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీ్ధర్ కుమార్ వివరించారు.