క్రైమ్/లీగల్

బ్లాస్టింగ్ ట్రాక్టర్ క్రిందపడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దనూరు, ఏప్రిల్ 14: మండల పరిధిలోని ఒబుళాపురం సమీపంలోని కొండగుట్టలో బ్లాస్టింగ్ కోసం రంద్రాలువేస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి అంకన్న(37) శనివారం మృతిచెందాడు. పోలీసులు సమాచారం మేరకు శనివారం ఉదయం కంకర రాయి కోసం గత రెండు రోజులుగా అనంతపురం జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ఓ క్రషర్ మిషన్ వారితో రంద్రాలువేసే ఒప్పదం కుదుర్చుకొని గుట్టకు రంద్రాలు వేస్తుండగా ట్రాక్టరు బొల్తాపడటంతో అంకన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారన్నారు. వెంటనే సమాచారం తెలుసుకున్న ఎస్సై నరసింహారెడ్డి సంఘటనా స్థలానికివెళ్ళి పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి కేసు విచారిస్తున్నామన్నారు. మృతుని స్వగ్రామం అనంతరం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన కోసకుంట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు.