క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు,సెప్టెంబర్ 16: పునాదిపాడులోని నారాయణ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రగాయాల పాలైన సంఘటన కంకిపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మచిలీపట్నానికి చెందిన కోటేశ్వరరావు అతని తల్లి సుబ్బమ్మ అంబాసిడర్ కారులో ఉప్పులూరుకు వెళుతుండగా, విజయవాడ నుంచి మొవ్వ వస్తున్న రమేష్ కంకిపాడు జాతీయ రహదారి, నారాయణ కళాశాల వద్ద వన్‌వేలో వస్తున్న అంబాసిడర్ కారు ఎదురుగా వస్తున్న ఆల్టో కారును ఢీకొనగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలు పాలైయ్యారు. అటుగా వెళుతున్న జేసీ మాధవీలత ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆల్టో కారులో ఉన్న రమేష్ మొవ్వ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రమేష్ కంకిపాడు తహసీల్దార్‌కి సమాచారం ఇచ్చి కంకిపాడు ప్రభుత్వాస్పత్రకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించి కార్యదర్శి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యదర్శి ఆరోగ్య పరిస్థితి గురించి తహసీల్దార్ సతీష్, సీఐ శివాజీ, ఎస్‌ఐ మహ్మద్ షరీఫ్ పరిశీలించారు.